టౌన్‌షిప్‌ కమిటీ నిర్ణయాలను అమలు చేయండి

ABN , First Publish Date - 2022-05-20T05:41:13+05:30 IST

హార్సిలీహిల్స్‌లో టౌన్‌ షిప్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాల అమలును వేగవంతం చేయాలని మదనపల్లె ఆర్డీవో మురళి అధికారులను ఆదేశించారు.

టౌన్‌షిప్‌ కమిటీ నిర్ణయాలను అమలు చేయండి
హార్సిలీహిల్స్‌లో పర్యటిస్తున్న మదనపల్లె ఆర్డీవో మురళి

బి.కొత్తకోట మే 19 :  హార్సిలీహిల్స్‌లో   టౌన్‌ షిప్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాల అమలును వేగవంతం చేయాలని మదనపల్లె ఆర్డీవో మురళి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హార్సిలీహిల్స్‌లో పర్యటించి వివిధ శాఖలకు గతం లో కేటాయించిన భూములను, అందు లోని భవనాలను, లీజుకు ఇచ్చిన స్థలాలను  పరిశీలించారు. హార్సిలీహిల్స్‌లో అక్రమణల ను గుర్తించి వాటి తొలగింపునకు చర్యలు చేపట్టడంతోపా టు ప్రభుత్వ శాఖలు ప్రైవేటు వారికి లీజుకు ఇచ్చిన వాటిని స్వాధీనం చేసుకోవడానికి సంబందిత శాఖలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.  కార్యక్రమం లో మదనపల్లె డీఎల్పీవో లక్ష్మి, టూరిజం మేనేజర్‌ సాల్వీన్‌రెడ్డి,  తహసీల్దార్‌ ధనంజయులు, ఎంపీడివో శంకరయ్య, వీఆర్వో ఖాదర్‌ బాషా పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T05:41:13+05:30 IST