విద్యా కానుక సామగ్రి దిగుమతి

ABN , First Publish Date - 2020-07-06T11:46:29+05:30 IST

నూతన విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ..

విద్యా కానుక సామగ్రి దిగుమతి

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూలై 5 : నూతన విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు త్వరలో పంపి ణీ చేయనున్న విద్యా కానుకలో భాగంగా ఆదివారం ఏలూరు మండలాని కి నోట్‌ పుస్తకాలు, సాక్స్‌లు, యూనిఫాం, స్కూల్‌ బ్యాగ్‌ల బండి ళ్లు అందా యి. వీటిని తొలుత ఏలూరు రూరల్‌ మండలం విద్యార్థులకు పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీ చేస్తామని ఎంఈవో ఎస్‌.నరసింహమూర్తి తెలి పారు. మండలంలో రూ.18 లక్షల విలువైన నోట్‌ పుస్తకాలు పంపిణీ చేస్తా మన్నారు. విద్యా కానుక కిట్లను డీఈవో రేణుక, సమగ్ర శిక్ష సీఎంవో టీటీ ఎఫ్‌ రూజ్‌వెల్ట్‌, అర్బన్‌ డీఐ సాంబశివరావు పరిశీలించారు. త్వరలోనే మిగ తా పాఠ్య పుస్తకాలు, విద్యా కానుకలో మిగిలిన సామగ్రి జిల్లాకు దిగుమతి అవుతాయని వివరించారు. 

Updated Date - 2020-07-06T11:46:29+05:30 IST