ఆకట్టుకున్న సాంస్కృతిక వేడుకలు

ABN , First Publish Date - 2022-08-15T05:55:00+05:30 IST

స్వాతంత్య్ర భారత్‌ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సిరిసిల్ల సినారె కళామందిరంలో ఆదివారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌, జిల్లా విద్యాశాఖ సౌజన్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక వేడుకలు
ప్రారంభిస్తున్న చైర్‌పర్సన్‌ జిందం కళ

సిరిసిల్ల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) స్వాతంత్య్ర భారత్‌ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సిరిసిల్ల సినారె కళామందిరంలో ఆదివారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌, జిల్లా విద్యాశాఖ సౌజన్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.  దేశభక్తిని చాటుతూ 12 పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన ఇచ్చారు.  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర భారత్‌ వజ్రోత్సవాల ద్వారా దేశభక్తి పెరుగుతుందని, విద్యార్థి దశలోనే త్యాగధనుల చరిత్రలు తెలుసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీపీఆర్వో ధశరథం, డీఈవో రాధాకిషన్‌, కౌన్సిలర్‌ భూక్య రెడ్డినాయక్‌  పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-15T05:55:00+05:30 IST