డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జైలు శిక్ష
ABN , First Publish Date - 2021-07-31T01:25:13+05:30 IST
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి కోర్టు జైలు శిక్ష విధించింది. యాదగిరిగుట్ట
యాదాద్రి: డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి కోర్టు జైలు శిక్ష విధించింది. యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్లో 13 మంది పట్టుబడ్డారు. వీరిని కోర్టుకు తరలించారు. వీరిలో ఐదుగురికి 24 గంటల జైలు శిక్షను కోర్టు విధించింది. అందరికీ రూ.2వేల జరిమానాను ఆలేరు కోర్టు విధించింది.