2022 మార్చి కల్లా 60 శాతం మందికి కరోనా కాటు.. కొత్త అధ్యయనం

ABN , First Publish Date - 2021-12-24T03:14:55+05:30 IST

వచ్చే ఏడాది జనవరి, మార్చి నెలల మధ్యలో 60 శాతం మంది అమెరికన్లు కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ బారిన పడతారని వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ జరిపిన తాజాగా అధ్యయనంలో తేలింది.

2022 మార్చి కల్లా 60 శాతం మందికి కరోనా కాటు.. కొత్త అధ్యయనం

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది జనవరి, మార్చి నెలల మధ్యలో 60 శాతం మంది అమెరికన్లు కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ బారిన పడతారని వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ జరిపిన తాజాగా అధ్యయనంలో తేలింది. కేసుల సంఖ్య పెరిగినప్పటికీ ఆస్పత్రల్లో చేరేవారి సంఖ్య, మరణాలు తక్కువగానే ఉంటాయని అక్కడి శాస్త్రవేత్తలు తేల్చారు. జనవరి చివరల్లో అమెరికాలో కరోనా కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరుకుంటుందని కూడా అంచనా కట్టారు. ‘‘మా అంచనా ప్రకారం..మార్చి నెల కల్లా మొత్తం కేసుల శాతం 60 శాతానికి చేరుతుంది’’ అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-24T03:14:55+05:30 IST