మాయల ఫకీర్‌ ప్రభుత్వం రాజ్యమేలుతోంది

ABN , First Publish Date - 2022-07-01T06:40:18+05:30 IST

రాష్ట్రంలో మాయల ఫకీర్‌ ప్రభుత్వం రాజ్యమేలుతోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు.

మాయల ఫకీర్‌ ప్రభుత్వం రాజ్యమేలుతోంది

ఆత్రేయపురం, జూన్‌ 30: రాష్ట్రంలో మాయల ఫకీర్‌ ప్రభుత్వం రాజ్యమేలుతోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. గురువారం వద్దిపర్రులో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంచిపెడుతూ నిరసన వ్యక్తం చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చిననాటి నుంచి అసమర్ధత, అరాచకం రాజ్యమేలుతోందన్నారు. అధికారులు ప్రజా సమస్యలను పక్కనపెట్టి అధికార పార్టీ నాయకుల సేవలో పరితపిస్తున్నారని విమర్శించారు. గోదావరి పక్కనే ఉన్నా పంట పొలాలకు చుక్కనీరు అందని దుస్థితి దాపురించిందన్నారు. కరెంటు బిల్లులుపేదవారికి షాక్‌ కొడుతున్నాయన్నారు. ఇటువంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ చూడలేదన్నారు. ముళ్లపూడి భాస్కరరావు, జుజ్జవరపు హరిబాబు, వాకలపూడి సూరిబాబు, పల్లికొండ వజ్రకుమార్‌, రమేష్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-01T06:40:18+05:30 IST