గూడ్స్‌ రైలుకు ఎదురెళ్లి..

ABN , First Publish Date - 2022-07-02T08:57:12+05:30 IST

గూడ్స్‌ రైలుకు ఎదురెళ్లి..

గూడ్స్‌ రైలుకు ఎదురెళ్లి..

ఉద్యోగం రాలేదని ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

మృతుడు కాకినాడ వాసి.. వరంగల్‌ జిల్లాలో ఘటన

గిర్మాజిపేట, జూలై 1: బీటెక్‌ పూర్తి చేసి ‘గేట్‌’కు శిక్షణ తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు గురువారం వరంగల్‌ జిల్లా చింతల్‌పల్లి వద్ద గూడ్స్‌రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ జీఆర్‌పీ సీఐ జి.నరేష్‌ శుక్రవారం  తెలిపిన వివరాల ప్రకారం.. తుని మండలం మల్లవరానికి చెందిన చలపాకల ఉపేంద్ర (25) బీటెక్‌ పూర్తి చేసి  హైదరాబాద్‌లో గేట్‌ శిక్షణ తీసుకుంటున్నాడు. ట్యూషన్‌లు చెబుతూ చదువుకున్న ఉపేంద్ర బీటెక్‌తోపాటు కొద్దికాలం ప్రయివేట్‌ ఉద్యోగం చేసి మానేశాడు. తన చదువుకు తగిన ఉద్యోగం రావడం లేదని బాధపడుతుండేవాడు. గురువారం సాయంత్రం చింతల్‌పల్లి-ఎల్గూరు రైల్వేస్టేషన్‌ల మధ్య సంగెం రైల్వేగేటు వద్ద విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలుకు ఎదురెళ్లి.. అది ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.  

Updated Date - 2022-07-02T08:57:12+05:30 IST