హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-09T04:40:15+05:30 IST
ఇటీవల నెల్లూరులోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతంలో జరిగిన హత్య కేసులో వేదాయపాళెం పోలీసులు శనివారం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
నెల్లూరు(క్రైం) : మే 8: ఇటీవల నెల్లూరులోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతంలో జరిగిన హత్య కేసులో వేదాయపాళెం పోలీసులు శనివారం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఉమ్మారెడ్డి గుంట ప్రాంతంలో ఇటీవల కొందరు వ్యక్తులు వెంకటేశ్వర్లు ఇంటికెళ్లి ఆయన్ను కత్తులతో పొడిచి హత్య చేశారు. శనివారం ఆ కేసులో నిందితులైన దిలీప్కుమార్ అలియాస్ దిలీప్, ప్రభుదాస్ అలియాస్ ప్రభు, సాయికార్తీక్ అలియాస్ కార్తీక్, గోవర్ధన్ అలియాస్ గోవాను అరెస్ట్ చేసినట్లు సీఐ కె. రామకృష్ణ తెలిపారు.