వృద్ధాప్యంలో అందరితో కలిసిమెలిసి జీవించాలి
ABN , First Publish Date - 2022-10-02T03:44:21+05:30 IST
వృద్ధాప్యంలో అందరితో కలిసి మెలిసి సంతోషంగా జీవించాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ప్రపంచ వయోవృద్ధుల వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులు తమ అను భవంతో భావితరాలకు మార్గదర్శకత్వం చేయాలన్నారు. పిల్లలను మానవ సంబంధాలు తెలిసేలా పెంచాలన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 1: వృద్ధాప్యంలో అందరితో కలిసి మెలిసి సంతోషంగా జీవించాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ప్రపంచ వయోవృద్ధుల వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులు తమ అను భవంతో భావితరాలకు మార్గదర్శకత్వం చేయాలన్నారు. పిల్లలను మానవ సంబంధాలు తెలిసేలా పెంచాలన్నారు. వృద్దుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, సమస్యల పరి ష్కారం, అవసరాలకు టోల్ఫ్రీ నం.14567 ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వయోవృద్ధులు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పలువురు వయో వృద్ధులను సన్మానించారు. జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, పంచాయతీ అధికారి నారాయణరావు, గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, డేకేర్ సెంటర్ అధ్యక్షుడు మొండయ్య, సీడీపీవోలు, జిల్లా బాలల సంక్షేమ అధికారి ఆనంద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.