నడ్డా కొత్త టీమ్‌లో తేజస్వి సూర్య, పురందేశ్వరి

ABN , First Publish Date - 2020-09-26T21:48:27+05:30 IST

బీజేపీ జాతీయ కార్యవర్గంలో మార్పులు చేర్పులు చేశారు. కొత్త టీమ్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు..

నడ్డా కొత్త టీమ్‌లో తేజస్వి సూర్య, పురందేశ్వరి

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కార్యవర్గంలో మార్పులు చేర్పులు చేశారు. కొత్త టీమ్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడుగా జేపీ నడ్డా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల తర్వాత తొలిసారి ఈ నియామకాలు జరిపారు. కొన్ని టాప్ పోస్టుల నుంచి కొందర్ని తప్పించి, కొత్త వారికి చేటు కల్పించారు. రాష్ట్రాల్లో నాయకత్వాన్ని అభివృద్ధి చేసే దిశగా నియామకాలు చేపట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులు చోటుచేసుకోవడం విశేషం.


పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా డాక్టర్ రమణ్ సింగ్, ముకుల్ రాయ్, అన్నపూర్ణ దేవి, బైజయంత్ జే పాండాలను నియమించారు. తెలంగాణ నుంచి డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు.

యువ మోర్చా అధ్యక్షుడుగా తేజస్వి సూర్యను నియమించారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రామ్ మాధవ్, మురళీధర్ రావు, అనిల్ జైన్‌లకు ప్రధాన కార్యదర్శుల బాధ్యతల నుంచి తప్పించారు. పంజాబ్‌కు చెందిన తరుణ్ చుగ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా తీసుకువచ్చారు. మాజీ కేంద్రం మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె పంకజను పార్టీ సెక్రటరీగా నియమించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను బీజేపీ ఉపాధ్యక్షురాలిగా నియమించారు.


జాతీయ ఉపాధ్యక్షులు వీరే...

డాక్టర్ రమణ్ సింగ్, ఎమ్మెల్యే (ఛత్తీస్‌గఢ్), శ్రీమతి వసుంధరా రాజే సింధియా, ఎమ్మెల్యే (రాజస్థాన్), రాధా మోహన్ సింగ్, ఎంపీ (బీహార్), బైజంయత్ జే పాండే (ఒడిశా), రుఘబర్ దాస్ (జార్ఖాండ్), ముకుల్ రాయ్ (పశ్చిమ బెంగాల్), రేఖావర్మ, ఎంపీ (ఉత్తరప్రదేశ్), అన్నపూర్ణా దేవి, ఎంపీ (జార్ఖాండ్), డాక్టర్ భఆరత్ బెన్ షియాల్, ఎంపీ (గుజరాత్), డీకే అరుణ (తెలంగాణ), ఎం.చుబావో (నాగాలాండ్), అబ్దుల్లా కుట్టి (కేరళ).

జాతీయ ప్రధాన కార్యదర్శులు

భూపిందర్ యాదవ్, ఎంపీ (రాజస్థాన్), అరుణ్ సింగ్, ఎంపీ (ఉత్తరప్రదేశ్), కైలాష్ విజయవర్గీయ (మధ్యప్రదేశ్), దుష్యంత్ కుమార్ గౌతమ్, ఎంపీ (ఢిల్లీ), డి.పురందరేశ్వరి (ఆంధ్రప్రదేశ్), సీటీ రవి, ఎమ్మెల్యే (కర్ణాటక), తరుణ్ చుక్ (పంజాబ్), దిలీప్ సైకియా, ఎంపీ (అసోం).

జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)

బీఎల్.సంతోష్ (ఢిల్లీ)

జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు

వి.సతీష్ (ముంబై), సౌదాన్ సింగ్ (రాజ్‌పూర్), శివప్రకాష్ (లక్నో)

జాతీయ కార్యదర్శులు

శ్రీ వినోద్ తావడే (మహారాష్ట్ర)

Updated Date - 2020-09-26T21:48:27+05:30 IST