నరసింహుని సన్నిధిలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు పూజలు
ABN , First Publish Date - 2022-06-27T06:27:43+05:30 IST
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాల యా న్ని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు కుటుంబ సమేతంగా ఆదివా రం సందర్శించారు.
ధర్మపురి, జూన్ 26: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాల యా న్ని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు కుటుంబ సమేతంగా ఆదివా రం సందర్శించారు. వేదపండితులు, అర్చకులు, సిబ్బంది వారికి సాంప్ర దాయం ప్రకారం సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి స న్నిధిలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ మంత్రోచ్ఛరణల మధ్య వారిని ఘనంగా ఆశీర్వదించారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివా స్ వారికి స్వామి శేషవస్త్రం, ప్రసాదాలు, చిత్రపటం అందించారు. అను బంధ ఆలయాలను కూడ సందర్శించారు. వారి వెంట ఆలయ ముఖ్య అర్చకులు రమణాచార్యా, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనభట్ల దినే ష్, ఆలయ సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్కుమార్, సీనియర్ అసిస్టెం ట్ అలువాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
నరసింహుని సన్నిధిలో ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్కుమార్ దంపతులు ఆదివారం సందర్శించారు. ఆలయం వద్ద వారికి సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం స్వా మి సన్నిధిలో పూజలు నిర్వహించగా వేదపండితులు వారిని ఘనంగా ఆశీర్వదించారు. ఆలయ ఈవో శ్రీనివాస్, మున్సిపల్ వైస్చైర్మన్, రినోవే షన్ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య వారికి స్వామి శేష వస్త్రం, ప్రసాదాలు, చిత్రపటం అందించారు.