వేసవిలో... ‘ఇమ్యూనిటీ’ పెంచే ఆహారం
ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST
నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి.. లాంటి సిట్రస్ ఫుడ్ను సలాడ్స్, జ్యూస్, స్మూతీస్.. ఇలా ఇతర రూపాల్లో తీసుకోవటం మంచిది.
వేసవిలో చర్మంపై అలర్జీలు, దగ్గు, ఫ్లూలు వస్తుంటాయి. ఇదంతా ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్లే. ఇంతకీ సమ్మర్లో వ్యాధి నిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలేంటీ...
నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి.. లాంటి సిట్రస్ ఫుడ్ను సలాడ్స్, జ్యూస్, స్మూతీస్.. ఇలా ఇతర రూపాల్లో తీసుకోవటం మంచిది. సిట్రస్ ఆమ్లం ఉండే ఆహారంలో సి-విటమిన్ అధికంగా ఉంటుంది. శరీరంలోని ఎలక్ర్టోలైట్స్ను బ్యాలెన్స్ చేయటంతో పాటు బ్యాక్టీరియాతో పోరాడతాయి. తద్వారా సీజనల్ అలర్జీలకు చరమగీతం పాడే శక్తి ఈ ఆహారానికి ఉంది.
గుమ్మడికాయ, క్యారెట్లో ఎ,సి విటమిన్లు ఉంటాయి. పీచుపదార్థంతో ఉండటంతో ఇవి సులువుగా జీర్ణమవుతాయి. పొటాషియం ఉంటుంది. వీటిలో యాంటియాక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడే గుణం వీటికి ఉంది.
కోడిగుడ్లలో విటమిన్-డి, ప్రొటీన్లు ఉంటాయి. రోజుకు ఒక ఉడకబెట్టిన ఆహారం తినటం వల్ల పిల్లల పెరుగుదలకు మంచిది. పెద్దలైనా కోడిగుడ్డు తింటే మంచిది.
బాదం, పిస్తా.. లాంటి నట్స్లో ఫోలిక్ యాసిడ్, నియాసిన్, జింక్, సెలేనియమ్తో పాటు న్యూట్రిన్లు ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం వీటికి ఉంది. పిల్లలు, గర్భిణులకు మంచి ఆహారమిది.
పుచ్చకాయ, తర్భూజ..లాంటి పండ్లలో నీటిశాతం పుష్కలం. వీటిలో మాంగనీసు, విటమిన్-ఎ, పొటా షియం ఉంటుంది. చల్లదనంతో పాటు బ్లడ్ ప్రెషర్ను, రక్తంలోని చక్కెరశాతాన్ని నియంత్ర ణలోకి వస్తాయి. డీహైడ్రేట్ కాకుండా కాపాడే గుణం వీటికి ఉంది. జ్యూస్ రూపంలో కాకుండా ఈ పండ్లను తిన్నప్పుడే మంచి ఫలితం ఉంటుంది.
మసాలాలు, వేపుళ్లు తినకపోవటమే మంచిది. ఎలాంటి ఆహారం తిన్నా.. దప్పిక ఉన్నప్పుడే మంచి నీళ్లు బాగా తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్ బారినపడరు.
మజ్జిగ తాగడం, పెరుగుతో భోజనం వల్ల పొట్టలో అన్ఈజీగా ఉండదు.