గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష
ABN , First Publish Date - 2022-07-26T16:53:25+05:30 IST
Hyderabad: కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. దీన్ని నిరసిస్తూ నేడు గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష
Hyderabad: కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ మంగళవారం మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. దీన్ని నిరసిస్తూ నేడు గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. దీక్షకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, పొన్నాల, మహేష్ కుమార్ గౌడ్, దామోదర్ రెడ్డి, బోసు రాజు తదితరులు హాజరయ్యారు. బీజేపీ దమననీతికి నిరసనగా దీక్ష చేస్తున్నామన్న వారు తెలిపారు. ఈడీ కార్యాలయం నుంచి సోనియాగాంధీ బయటకు వచ్చే వరకు దీక్షలో పాల్లొంటామని పార్టీ నాయకులు చెబుతున్నారు.