పాల్తేరులో వంగవీటి రంగా విగ్రహం ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-01-17T06:17:11+05:30 IST

మండలంలోని పాల్తేరు గ్రామంలో శనివారం వంగవీటి రంగా విగ్రహం ఆవిష్కృతమైంది.

పాల్తేరులో వంగవీటి రంగా విగ్రహం ఆవిష్కరణ
రంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

 

పాయకరావుపేట రూరల్‌, జనవరి 16 : మండలంలోని పాల్తేరు గ్రామంలో శనివారం వంగవీటి రంగా విగ్రహం ఆవిష్కృతమైంది. రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగా అన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ చిక్కాల రామారావు, బీజేపీ నాయకుడు తోట నగేశ్‌, జనసేన నాయకుడు గెడ్డం బుజ్జి, డి.సూర్యచక్రం, వెంకటేశ్వరరావు, రాజబాబు, జగతా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T06:17:11+05:30 IST