గండికి రూ.52లక్షల ఆదాయం
ABN , First Publish Date - 2022-09-27T05:30:00+05:30 IST
గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో మంగళవా రం సహాయ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి ఆధ్వర్యంలో కొబ్బరికాయల వేలం పాట నిర్వహించారు.
చక్రాయపేట, సెప్టెంబరు 27: గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో మంగళవా రం సహాయ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి ఆధ్వర్యంలో కొబ్బరికాయల వేలం పాట నిర్వహించారు. పులివెందులకు చెందిన లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.52 లక్షలకు వేలంపాట పాడి దక్కించుకున్నారు. ఏడాది పాటు గండి క్షేత్రంలో కొబ్బరికాయలు అమ్ముకునేందుకు టెండర్లు నిర్వహించగా ఒక్కొక్కరు రూ.5లక్షల డిపాజిట్ చెల్లించి 15 మంది పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన వేలంపాటలో శ్రీనివాసరెడ్డి రూ.52లక్షలకు దక్కించుకోవడం విశేషం. ఆలయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో వేలంపాట పాడటం ప్రథమం అని చెప్పవచ్చు. దీంతో గత ఏడాది కంటే ఈఏడాది రూ.15 లక్షల ఆదాయం పెరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యవేక్షణ అధికారి అండ్లగుత్తి శ్రీనివాసులు, చైర్మన్ పి.రాఘవేంద్రప్రసాద్, ప్రధాన అర్చకులు కేసరి, ఉప అర్చకులు రాజారమేష్, పాలక మండలి సభ్యులు రామాంజనేయరెడ్డి, తేజ, ఏపీజీబీ మేనేజర్ అశోక్కుమార్, ఏఎ్సఐ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.