అసంపూర్తి పనులను పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-07-27T04:10:10+05:30 IST
హజ్ హౌజ్లో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే వర్షం కారణంగా సెల్లార్ లోపల నిలిచి ఉన్న నీటిని వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారి ఏఈ మహేష్, కాంట్రాక్టర్ను ఆదేశించారు.
మున్సిపల్ కమిషనర్ రమణాచారి
సిద్దిపేట సిటీ, జూలై 26 : హజ్ హౌజ్లో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే వర్షం కారణంగా సెల్లార్ లోపల నిలిచి ఉన్న నీటిని వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారి ఏఈ మహేష్, కాంట్రాక్టర్ను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని హజ్ హౌజ్, ఆదర్శనగర్, కుషాల్నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజ్ హౌజ్ చుట్టూ ఎనినల్ గార్డ్ని నిర్మించి, సెక్యూరిటీగార్డును నియమించాలన్నారు. హజ్ హౌజ్ నిర్వహణ సరిగా చూసుకోవాలని యాజమాన్యానికి సూచించారు. మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ఆదర్శనగర్, కుషాల్నగర్లోని శ్మశానవాటిక రోడ్డు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతారాంనగర్లో హై టెన్షన్ వైర్ కింద నిర్మిస్తున్న నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొండం సంపత్, టౌన్ ప్లానింగ్ అధికారులు నస్రీన్భాను, విజయలక్ష్మి, శ్రీనివా్సరెడ్డి, ఏఈ మహేష్ పాల్గొన్నారు.