53 ఏళ్ల ఒంటరి మహిళతో పరిచయం.. ఆమె నగ్నంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీసి.. చివరకు..

ABN , First Publish Date - 2021-10-20T03:25:57+05:30 IST

కేరళలోని తిరువనంతపురంలో 44 ఏళ్ల వ్యక్తి.. ఫేస్‌బుక్‌లో 53ఏళ్ల మహిళతో పరిచయం పెంచుకున్నాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలో ఓ రోజు

53 ఏళ్ల ఒంటరి మహిళతో పరిచయం.. ఆమె నగ్నంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీసి.. చివరకు..

ఫేస్‌బుక్ ద్వారా ఎక్కడిడెక్కడి వారో పరిచయం అవుతూ ఉంటారు. వీటిలో కొన్ని పరిచయాల వల్ల మంచి జరిగితే.. మరికొన్ని పరిచయాల వల్ల మొత్తానికే మోసం జరుగుతూ ఉంటుంది. కేరళలోని తిరువనంతపురంలో 44 ఏళ్ల వ్యక్తి.. ఫేస్‌బుక్‌లో 53ఏళ్ల మహిళతో పరిచయం పెంచుకున్నాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలో ఓ రోజు ఆమె నగ్నంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. తర్వాత జరిగిన ఘటనతో ఆ మహిళ షాక్‌కు గురైంది. వివరాల్లోకి వెళితే..


 కేరళకు చెందిన ప్రదీప్ నాయర్ అనే వ్యక్తికి.. భర్తకు విడాకులిచ్చిన 53 ఏళ్ల మహిళతో  ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. రోజూ చాటింగ్ చేసుకునేవారు. తర్వాత ఫోన్ నంబర్లు తీసుకుని మాట్లాడుకునేవారు. తర్వాత తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. శారీరకంగా కూడా దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆమెను నమ్మించిన ప్రదీప్.. ఖర్చులకు ఆమెతో డబ్బులు తీసుకునేవాడు. ఆమె నగ్నంగా ఉన్నప్పుడు.. ఫొటోలు, వీడియోలు తీశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రదీప్.. తర్వాత ప్రస్తావనే తేలేదు. తర్వాత మహిళకు ఓ నిజం తెలిసింది. అప్పటికి ప్రదీప్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా తెలీకుండా దాచాడనే విషయం తెలిసింది.


ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో కోపం పెంచుకున్న ప్రదీప్.. ఆమె ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌, మహిళ వాట్సప్‌కు పంపించాడు. అవి చూసి షాక్‌కు గురైన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రదీప్ నాయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేవలం డబ్బుల కోసమే ప్రదీప్.. ఆ మహిళను నమ్మించి ఇలా చేశాడని తేలింది.

Updated Date - 2021-10-20T03:25:57+05:30 IST