వైసీపీ పాలనలో పెరిగిన దాడులు

ABN , First Publish Date - 2022-05-22T05:29:53+05:30 IST

వైసీపీ ప్రభుత్వ హ యాంలో వ్యాపారవర్గాలపై దాడులు పెరిగాయ ని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో పెరిగిన దాడులు
రవికుమార్‌కు కృతజ్ఞతలు చెబుతున్న ఆంజనేయులు

 ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

బల్లికురవ, మే 21: వైసీపీ ప్రభుత్వ హ యాంలో వ్యాపారవర్గాలపై దాడులు పెరిగాయ ని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని కొణిదెన గ్రామా నికి చెందిన అర్వపల్లి ఆంజనేయులును తెలుగు దేశం పార్టీ వాణిజ్య విబాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. శనివారం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను ఆయన స్వగృహమైన చిలకలూరిపేటలో కలిశారు. త న నియామకానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంద ర్భగా రవికుమార్‌ మాట్లాడుతూ వ్యాపార వర్గాలకు అండగా టీడీపీ నిలుస్తుందన్నారు. వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని, పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా వ్యాపారవర్గాలు అండగా నిలబ డాలని కోరారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.


మృతుని కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

అద్దంకి, మే 21: మండలంలోని శంకవరప్పాడులో టీడీపీ నాయకు డు కోండ్రు వీరాంజనేయులు తండ్రి సుబ్బారావు జ్ఞాపకార్థ  కూడిక  శని వారం జరిగింది. ఎమ్మెల్యే రవికుమా ర్‌ హాజరై సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో టీడీపీ నేతలు కరి  పరమేష్‌, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చాగంటి  రాజేంద్ర తదితరులు ఉన్నారు. అలాగే, చిలకలూరిపేటలో రోటరీక్లబ్‌ ఆవరణలో తియ్యగూర కోటిరెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఎమ్మెల్యే రవి కుమార్‌ ప్రారంభించారు. కోటిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.

Updated Date - 2022-05-22T05:29:53+05:30 IST