గిరిజనులకు రిజర్వేషన్ పెంపు గొప్ప నిర్ణయం: ఎమ్మెల్సీ
ABN , First Publish Date - 2022-10-02T04:47:48+05:30 IST
గిరిజనులకు రిజర్వేషన్ పెంపు గొప్ప నిర్ణయమని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్పరెడ్డి అన్నారు.
గజ్వేల్, అక్టోబరు 1: గిరిజనులకు రిజర్వేషన్ పెంపు గొప్ప నిర్ణయమని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్పరెడ్డి అన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ను 6 నుంచి 10 శాతానికి పెంచడం పట్ల గజ్వేల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏకలవ్య ఎరుకల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. వారితో ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, కౌన్సిలర్లు గోపాల్రెడ్డి, కూరాకుల శ్రీనివాస్, నాయకులు ఉన్నారు. అలాగే గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని 4, 16వ వార్డులో గల ప్రజ్ఞాపూర్ ఊరచెరువులో వారు చేపపిల్లలను వదిలారు. వారివెంట మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మునిసిపల్ వైస్ చైర్మన్ జకీ, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు నవాజ్మీరా, నాయకులు ఉన్నారు.