అమ్మాయి ఫోన్ చేయడంతో ఫ్లాట్ అయిన ఆర్మీ జవాన్.. ఆ తర్వాత జరిగిన కథేంటంటే?
ABN , First Publish Date - 2022-05-30T09:06:25+05:30 IST
ఒక అందమైన అమ్మాయి అనుకోకుండా తనకు ఫోన్ చేయడంతో ఆర్మీలో పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత వాళ్లిద్దరి మాటలు కలిశాయి. తనది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అని, బెంగళూరులోని ఆర్మీ రెజిమెంట్లో నర్సింగ్ చేస్తున్నానని ఆమె చెప్పింది...
ఒక అందమైన అమ్మాయి అనుకోకుండా తనకు ఫోన్ చేయడంతో ఆర్మీలో పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత వాళ్లిద్దరి మాటలు కలిశాయి. తనది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అని, బెంగళూరులోని ఆర్మీ రెజిమెంట్లో నర్సింగ్ చేస్తున్నానని ఆమె చెప్పింది. ఆ మాటలు నమ్మిన ప్రదీప్ ఆమెతో టచ్లో ఉన్నాడు. ఇద్దరూ సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకునేవాళ్లు.
ఈ క్రమంలో ఒకరోజు అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పిందామె. అప్పటికే ఫొటోలు, వీడియో చాటింగ్లలో ఆమె అందాన్ని చూసిన ప్రదీప్ పూర్తిగా ఫ్లాట్ అయిపోయాడు. ఆమె ఏం అడిగినా చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతనికి ఆర్మీ వాళ్లు ఇప్పించిన మొబైల్ నెంబర్తో తనకు ఉన్న వాట్సాప్ను ఆమె కూడా యాక్సెస్ చేసే ఏర్పాట్లు చేశాడు. ఇలా ఆరేడు నెలలు ప్రేమాయణం సాగిన తర్వాత.. ఇంటెలిజెన్స్ అధికారులకు అసలు విషయం తెలిసింది.
ప్రదీప్ కుమార్ను పాకిస్తాన్లోని ఐఎస్ఐకి చెందిన ఒక మహిళ హనీట్రాప్లో ఇరికించిందని తేలింది. దాంతో వాళ్లు రంగంలోకి దిగి ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఆమె ఎంత సమాచారం లాక్కుంది తెలుసుకునే పనిలో పడ్డారు. ఇటీవల కోర్టు ముందుకు వచ్చిన ప్రదీప్ను రెండ్రోజుల పాటు జైపూర్ ఇంటెలిజెన్స్ విభాగానికి అప్పగించారు. వాళ్లు కూడా విచారణ జరిపిన తర్వాత మళ్లీ కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రదీప్ నుంచి అతని కొలీగ్స్ నెంబర్లు, ఇతర వివరాలు ఆమె సేకరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.