సీడీఎస్ బిపిన్ రావత్ మృతిపట్ల నివాళులర్పించిన భారతీయ సమాజం
ABN , First Publish Date - 2021-12-14T16:46:35+05:30 IST
తమిళనాడులో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా మరో 11 మంది మిలటరీ అధికారులు ప్రమాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేప
ఎన్నారై డెస్క్: తమిళనాడులో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా మరో 11 మంది మిలటరీ అధికారులు ప్రమాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైత్లోని ఇండియన్ ఎంబసీ సంతాప సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో కువైత్లోని భారత అంబాసిడర్ సిబి జార్జి సహా అనేక మంది భారతీయులు పాల్గొని నివాళులర్పించారు. భారత మొదటి సీడీఎస్గా బిపిన్ రావత్ చేసిన సేవలను సిబి జార్జి కొనియాడారు. ఆయన సేవలను భారత్ ఎప్పటికీ మర్చిపోదని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.