ఏడాది ముందే స్వాతంత్య్రం!

ABN , First Publish Date - 2022-08-15T10:20:16+05:30 IST

నిజానికి 1948 జూన్‌లో స్వతంత్ర భారతానికి అధికారం బదలాయించాలని బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది.

ఏడాది ముందే స్వాతంత్య్రం!

నిజానికి 1948 జూన్‌లో స్వతంత్ర భారతానికి అధికారం బదలాయించాలని బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది. అయితే హింసాత్మక ఆందోళనలు పెరిగిపోవడం.. సాయుధ బలగాల్లో నిరసనలతో నాటి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటన్‌ తేదీని ఏడాది ముందుకు జరిపారు. అంతేకాదు.. దేశవిభజనకు అంగీకరించాలని జవహర్‌లాల్‌ నెహ్రూ (కాంగ్రెస్‌), మహ్మదాలీ జిన్నా (ముస్లింలీగ్‌)పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దేశం ఐక్యంగా ఉండాలని గాంధీజీ స్పష్టంచేసినా.. విభజనను పూర్తిగా వ్యతిరేకించినా వారు సమ్మతించడం గమనార్హం. దరిమిలా 200 ఏళ్ల బ్రిటిష్‌ పాలన అంతమై 1947 ఆగస్టు 14/15న పాకిస్థాన్‌, భారత్‌ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. కొత్త దేశాల సరిహద్దులను సర్‌ సిరిల్‌ రాడ్‌క్లిఫ్‌ నిర్ధారించారు. అయితే వివాదాలు రేగకుండా.. జాప్యం జరగకుండా చూసేందుకు ఈ తతంగాన్ని రహస్యంగా ఉంచారు. దేశ విభజన జరిగిన రెండ్రోజుల తర్వాత దానిని ప్రచురించడం గమనార్హం.

Updated Date - 2022-08-15T10:20:16+05:30 IST