విద్యాభివృద్ధితోనే స్వాతంత్ర్యానికి సంపూర్ణత వస్తుంది
ABN , First Publish Date - 2022-08-15T03:49:54+05:30 IST
విద్యాభివృద్దితోనే స్వాతంత్ర్యానికి సంపూర్ణత వస్తుందని కలెక్టర్రాహుల్రాజ్ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవనంలో నిర్వహించిన వేడుకల్లో అదనపుకలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్పాయ్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
- కలెక్టర్ రాహుల్ రాజ్
ఆసిఫాబాద్, ఆగస్టు 14: విద్యాభివృద్దితోనే స్వాతంత్ర్యానికి సంపూర్ణత వస్తుందని కలెక్టర్రాహుల్రాజ్ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవనంలో నిర్వహించిన వేడుకల్లో అదనపుకలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్పాయ్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన కళా ప్రదర్శణ చాలా బాగుందన్నారు. గిరిజన బాలికల పాఠశాల విద్యార్థులు, ఆశ్రమపాఠశాల విద్యార్థులు చేసి నృత్యాలు ఎంత గానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆదివాసీ భవనం ఎదుట బాణాసంచా పేల్చి స్వాతంత్య్ర కాంక్షను చాటి చెప్పారు.