దేశ భక్తుల త్యాగాల ఫలితమే స్వతంత్ర భారతం
ABN , First Publish Date - 2022-08-16T04:33:28+05:30 IST
ఎందరో దేశభక్తుల త్యాగఫలితంగా ఈ స్వతం త్ర భారతావని లభించిందని కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారె డ్డి, కడప అసెంబ్లీ ఇన్చార్జ్ అమీర్బాబు పేర్కొన్నారు.
టీ డీపీ జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి
కడప, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఎందరో దేశభక్తుల త్యాగఫలితంగా ఈ స్వతం త్ర భారతావని లభించిందని కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారె డ్డి, కడప అసెంబ్లీ ఇన్చార్జ్ అమీర్బాబు పేర్కొన్నారు. జిల్లా కార్యాలయంలో వజ్రో త్సవాలను నిర్వహించారు. జాతీయ పతాకాన్ని టీడీపీ శ్రేణులు మధ్య ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడుతూ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడమే మనకర్తవ్యమన్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపిందని, హర్ఘర్ తిరంగా నినాదంతో ప్రతి ఇంటిపై ము వ్వన్నెల జెండా ఎగిరేలా చేసి ప్రతి ఒక్కరిలో భారత పౌరులమని గర్వంగా తలెత్తుకునే లా ప్రేరణ కలిగించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్, గోవర్థన్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వికా్సహరికృష్ణ, నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, రాంప్రసాద్, జనార్థన్రావుతో పాటు అధిక సంఖ్యలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని లింగారెడ్డి, ఎస్.అమీర్బాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి ఎర్రముక్కపల్లె, కోటిరెడ్డి సర్కిల్ కొత్త బస్టాండ్ మీదుగా జిల్లా కార్యాలయం చేరుకుంది. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ బీసీసెల్ కార్యదర్శి శ్రీనివాసులు, నబీకోట శ్రీనివాసులు, నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.