South Africa vs India: లంచ్ సమయానికి ఇండియా 75/2
ABN , First Publish Date - 2022-01-11T21:50:14+05:30 IST
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టలో భారత జట్టు లంచ్ సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 75 పరుగులు
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో భారత జట్టు లంచ్ సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 75 పరుగులు చేసింది. గాయం కారణంగా గత టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్తో మళ్లీ జట్టులోకి వచ్చాడు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు.
12 పరుగులు మాత్రమే చేసిన కేఎల్ రాహుల్ ఒలివియర్ బౌలింగ్లో పెవిలియన్ చేరగా, ఆ వెంటనే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా ఔటయ్యాడు. 15 పరుగులు చేసిన మయాంక్ రబడ బౌలింగులో పెవిలియన్ చేరాడు. క్రీజులో ఉన్న పుజారాతో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఇద్దరూ కలిసి నిదానంగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ప్రస్తుతం పుజారా 26, కోహ్లీ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.