వీబీఎం: గల్ఫ్ దేశాలకు 68 శాతం విమానాలు కేటాయింపు

ABN , First Publish Date - 2021-03-07T14:16:06+05:30 IST

కరోనా మహమ్మారి వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం 'వందే భారత మిషన్'(వీబీఎం) చేపట్టిన విషయం తెలిసిందే.

వీబీఎం: గల్ఫ్ దేశాలకు 68 శాతం విమానాలు కేటాయింపు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం 'వందే భారత మిషన్'(వీబీఎం) చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రభుత్వం వీబీఎం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 1 నుంచి 28 వరకు మొత్తం 1,350 రిపాట్రియేషన్ విమానాలు నడపనున్నట్లు పేర్కొంది. 28 దేశాల నుంచి సుమారు 2.60 లక్షల మంది భారత ప్రవాసులను స్వదేశానికి తీసుకురానున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. వీటిలో అత్యధికంగా 920 విమానాలు అంటే 68 శాతం ఫ్లైట్స్‌ను గల్ఫ్ దేశాలకు నడపనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 150 విమానాలు ఉత్తర అమెరికా నుంచి, 120 బ్రిటన్, యూరప్ నుంచి, సుమారు 100 ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి, 50 భారత పొరుగు దేశాలకు నడపనున్నట్లు శ్రీవాస్తవ తెలియజేశారు. కాగా, గతేడాది మే 6న ప్రారంభమైన వీబీఎం ద్వారా ఇప్పటి వరకు సుమారు 61.5 లక్షల మందిని స్వదేశానికి తరలించామన్నారు.  

Updated Date - 2021-03-07T14:16:06+05:30 IST