Tokyo Olympics 2020: స్పెయిన్పై భారత్ ఘన విజయం
ABN , First Publish Date - 2021-07-27T15:06:36+05:30 IST
విశ్వక్రీడలు ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది.
టోక్యో: విశ్వక్రీడలు ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. గ్రూపు-ఏ మూడో మ్యాచ్లో స్పెయిన్ను 3-0 తేడాతో మట్టికరిపించింది. ఆస్ట్రేలియా చేతిలో ఆదివారం 1-7 తేడాతో ఘోర పరాజయం తర్వాత అద్భుతంగా పుంజుకున్న మన్దీప్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్లోనే రెండు గోల్స్ చేసింది. మ్యాచ్ 14వ నిమిషంలో సిమ్రన్జిత్ సింగ్ తొలి గోల్ చేసి బోణీ కొట్టాడు. ఆ తర్వాత రూపిందర్ పాల్ రెండు గోల్స్(15ని, 51ని)తో భారత్ను స్పష్టమైన ఆధిక్యంలో నిలబెట్టాడు. ప్రత్యర్థి స్పెయిన్ ఏ దశలోనూ భారత్ను నిలువరించలేకపోయింది. దీంతో భారత జట్టు 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఇక తొలి మ్యాచ్లోనూ న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే.