Indiaలో 40వేలు దాటిన యాక్టీవ్ కేసులు

ABN , First Publish Date - 2022-06-11T15:55:14+05:30 IST

దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 40 వేలు దాటాయి.

Indiaలో 40వేలు దాటిన యాక్టీవ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు(Covid cases) మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 40 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8329 కొత్త కేసులు నమోదు అవగా... 10 మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఢిల్లీ,  హర్యానా రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 40,370 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 0.09 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 4,32,13,435 కేసులు అవగా... 5,24,757 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.69 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 4216 మంది కోలుకున్నారు.  దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,26,48,308 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

Updated Date - 2022-06-11T15:55:14+05:30 IST