భారత్‌లో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 22,270 కేసులు

ABN , First Publish Date - 2022-02-19T15:18:20+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

భారత్‌లో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 22,270 కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,270 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి 325 మంది మృతి చెందారు. అలాగే కొవిడ్ నుంచి కోలుకుని  60,298 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.21 శాతంగా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-02-19T15:18:20+05:30 IST