Indiaలో 8,488 కొత్త కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-11-23T16:33:37+05:30 IST

దేశంలో గడిచిన 24 గంటల్లో 8,488 కొత్త కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదు అయ్యాయి.

Indiaలో 8,488 కొత్త కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 8,488 కొత్త కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,18,901గా ఉందని... ఇది 538 రోజులలో కనిష్ట స్థాయి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మే తర్వాత ఈ సంఖ్య అత్యంత తక్కువగా నమోదు అయ్యింది. దేశంలో గత 24 గంటల్లో 249 కొత్త మరణాలు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మొత్తం మరణాల సంఖ్య 4,65,911కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ 117 కోట్లు దాటింది. 

Updated Date - 2021-11-23T16:33:37+05:30 IST