భారత్లో కొత్తగా 6,531 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-12-27T16:01:32+05:30 IST
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,531 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,531 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 7,141 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 75,841 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా రీకవరీ రేటు 98.40 శాతంగా నమోదు అయ్యింది. మరోవైపు దేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 578కి చేరింది.