177 కోట్లకు చేరుకున్న వ్యాక్సినేషన్

ABN , First Publish Date - 2022-02-27T18:35:24+05:30 IST

కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు దేశంలో 177.44 కోట్ల వ్యాక్సిన్లు పూర్తైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లోనే 24 లక్షలకు పైగా వ్యాక్సిన్లు పూర్తవడం విశేషం.

177 కోట్లకు చేరుకున్న వ్యాక్సినేషన్

కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు దేశంలో 177.44 కోట్ల వ్యాక్సిన్లు పూర్తైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లోనే 24 లక్షలకు పైగా వ్యాక్సిన్లు పూర్తవడం విశేషం. మొత్తం రెండు కోట్లకుపైగా వ్యాక్సిన్ డ్రైవ్‌లు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. నిన్న ఒక్క రోజే దాదాపు ఇరవై వేలకుపైగా కోవిడ్ పేషెంట్లు కోలుకున్నారని, ఇప్పటివరకు మొత్తం నాలుగు కోట్లమందికి పైగా పేషెంట్లు కరోనా నుంచి బయటపడ్డారని కేంద్రం చెప్పింది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. శనివారం రోజు దాదాపు 10,273 కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2022-02-27T18:35:24+05:30 IST