ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారతీయలను సురక్షితంగా తీసుకువచ్చాం: జై శంకర్

ABN , First Publish Date - 2022-03-16T02:36:25+05:30 IST

న్యూఢిల్లీ: రష్యా యుద్ధంతో ఉద్రిక్తతలు నెలకొన్న ఉక్రెయిన్ నుంచి ఆపరేషన్ గంగా ద్వారా 22, 500 మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించామని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పార్లమెంట్‌లో తెలియజేశారు.

ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారతీయలను సురక్షితంగా తీసుకువచ్చాం: జై శంకర్

న్యూఢిల్లీ: రష్యా యుద్ధంతో ఉద్రిక్తతలు నెలకొన్న ఉక్రెయిన్ నుంచి ఆపరేషన్ గంగా ద్వారా 22, 500 మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించామని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పార్లమెంట్‌లో తెలియజేశారు. ఈరోజు ఆయన రాజ్యసభ, లోక్ సభల్లో ఒక ప్రకటన చేస్తూ భారత పౌరులు ఎక్కడ ఎలాంటి సంక్షోభంలో ఉన్నా వారి రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందనేది మరోసారి రూఢీ అయిందన్నారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో మాట్లాడి మార్గం సుగమం చేశారని జై శంకర్ వెల్లడించారు. ఈ మొత్తం కార్యక్రమంలో 90 విమానాలను వినియోగించామన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా దాడిలో దుర్మరణం పాలైన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప భౌతిక కాయాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్దం త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని భారత్ కోరుకుంటోందన్నారు. 



Updated Date - 2022-03-16T02:36:25+05:30 IST