రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇండియాది శాంతి మార్గం: జై శంకర్

ABN , First Publish Date - 2022-04-06T21:06:26+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై న్యూఢిల్లీ ఒక మార్గం ఎంచుకోవాల్సి వస్తే శాంతి మార్గాన్నే..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇండియాది శాంతి మార్గం: జై శంకర్

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై న్యూఢిల్లీ ఒక మార్గం ఎంచుకోవాల్సి వస్తే శాంతి మార్గాన్నే ఎంచుకుంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. ఉక్రెయిన్‌లో పరిస్థితిపై లోక్‌సభలో చర్చకు మంత్రి బుధవారంనాడు సమాధానమిచ్చారు. ఉక్రెయిన్‌ సిటీ బుచాలో పౌరులను ఊచకోత కోస్తున్నట్టు వస్తున్న వార్తలు భారత్‌ను తీవ్రంగా కలిచివేస్తున్నట్టు చెప్పారు.


''రక్తపాతం, అమాయక ప్రజల ప్రాణాలు తీయడం వల్ల ఏ సమస్యకు పరిష్కారం కనుగొనలేం. నేటియుగం, ఇవాల్టి పరిస్థితుల్లో చర్యలు, దౌత్యం వల్లే ఎలాంటి సమస్యకైనా సరైన సమాధానం దొరుకుతుంది'' అని జైశంకర్ అన్నారు. ఇండియాను ఏదోఒక మార్గం ఎంచుకోమని అంటే ఇండియా శాంతి మార్గం వైపే ఉంటుందని, హింసకు తక్షణం ముగింపు పలకాలంటే ఇదే మార్గమని అన్నారు. ఐక్యరాజ్యస సమితితో సహా అన్ని అంతర్జాతీయ వేదకలు, చర్చల్లో భారత్ ఇదే వైఖరిని పదేపదే చెబుతూ వస్తోందని సభకు తెలిపారు. అంతర్జాతీయ చట్టాలను, అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలనే భావన అందరిలోనూ ఉండాలన్నారు. ఉక్రెయిన్‌ని బుచా సిటీలో పౌరల ఊచకోత ఘటనలను తాము ఖండిస్తున్నామని, ఇది చాలా తీవ్రమైన అంశమైనందున, దీనిపై స్వంతంత్ర విచారణకు  తాము మద్దతిస్తామని జైశంకర్ చెప్పారు.

Updated Date - 2022-04-06T21:06:26+05:30 IST