అఫ్ఘాన్ సుస్థిర భవిష్యత్తులో.. భారత్ సహా ఆ దేశాలకు భాగస్వామ్యం: బైడెన్
ABN , First Publish Date - 2021-04-15T17:41:36+05:30 IST
అఫ్ఘానిస్థాన్లోని అమెరికా బలగాలను ఈ ఏడాది సెప్టెంబరు 11 నాటికి పూర్తిగా ఉపసంహరించడానికి నిర్ణయించామని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్లోని అమెరికా బలగాలను ఈ ఏడాది సెప్టెంబరు 11వ తేదీ నాటికి పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించామని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అఫ్ఘాన్లో అమెరికా బలగాలు సేవలందించాయి. బుధవారం శ్వేతసౌధం నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడిన బైడెన్... "అఫ్ఘానిస్థాన్ సుస్థిర భవిష్యత్తులో భారత్, పాకిస్థాన్, రష్యా, చైనా, టర్కీ దేశాలకూ కీలక భాగస్వామ్యం ఉంది. అందుకే ఆ దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ఈ ఐదు దేశాలతో పాటు మిగతా దేశాలు కూడా చేయూతను ఇవ్వాలి. అఫ్ఘాన్ నుంచి మా పూర్తి బలగాలను సెప్టెంబర్ 11నాటికి ఉపసంహరించుకోవాలని నిర్ణయించాం." అని బైడెన్ అన్నారు.