2,075 కరోనా కొత్త కేసులు, 71 మంది మృతి

ABN , First Publish Date - 2022-03-19T21:23:26+05:30 IST

దేశంలో కొత్తగా 2,075 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,06,080కి చేరిందని..

2,075 కరోనా కొత్త కేసులు, 71 మంది మృతి

న్యూఢిల్లీ:  దేశంలో కొత్తగా 2,075 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,06,080కి చేరిందని, యాక్టివ్ కేసుల సంఖ్య 27,802కు తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించింది. కరోనా కారణంగా గత 24 గంటల్లో 71 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. దీంతో కరోనా కారణంగా ఇంతవరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,16,351కు పెరిగిందని వెల్లడించింది. మొత్తం ఇన్‌పెక్షన్‌ కేసులలో యాక్టివ్ కేసులు 0.06గా ఉందని, జాతీయ రికవరీ రేటు 98.73 శాతంగా రికార్డయినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోజవారీ పాజిటివిటీ రేటు 0.56 శాతంగానూ, వీక్లీ పాజిటివిటీ రేటు 0.41గాను ఉన్నట్టు వెల్లడించింది.. 


మరోవైపు, భారత ప్రభుత్వం ఉచితంగా,  డైరెక్ట్ స్టేట్ ప్రొక్యూర్‌మెంట్ (ఉచితంగా) కేటగిరి కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 183.31 కోట్ల వ్యాక్సిన్స్ అందజేసింది. ఇందులో 17.15 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందుబాటులో అంటే వినియోగంలోకి రావాల్సి ఉన్నాయి

Updated Date - 2022-03-19T21:23:26+05:30 IST