అంతర్జాతీయ మ్యాచ్లో వరుసగా ఏడోసారి ఓడిన భారత్
ABN , First Publish Date - 2020-11-30T00:37:50+05:30 IST
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో నేడు జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సేన 51 పరుగుల తేడాతో పరాజయం పాలైంది
సిడ్నీ: మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో నేడు జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సేన 51 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఇది భారత్కు వరుసగా ఏడో ఓటమి కాగా, రెండు వరుస వన్డే సిరీస్లలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.