దేశంలో 4,868కు చేరిన ఒమైక్రాన్ కేసులు

ABN , First Publish Date - 2022-01-12T15:08:18+05:30 IST

కరోనా, ఒమైక్రాన్ వేరియంట్ వైరస్‌లు దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

దేశంలో 4,868కు చేరిన ఒమైక్రాన్ కేసులు

న్యూఢిల్లీ: కరోనా, ఒమైక్రాన్ వేరియంట్ వైరస్‌లు దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా కేసులు రెండు లక్షలకు చేరువలో ఉండగా.. ఒమైక్రాన్ కేసులు ఐదు వేలకు చేరువలో ఉన్నాయి. దేశంలో 4,868 ఒమైక్రాన్ కేసులు నమోదు అవగా... 1,805 మంది ఒమైక్రాన్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,281 కేసులు నమోదు అయ్యాయి.

 

అలాగే రాష్ట్రాల వారీగా ఒమైక్రాన్ కేసులు:

రాజస్థాన్‌లో 645

ఢిల్లీలో 546

కర్నాటకలో 479

కేరళలో 350

పశ్చిమ బెంగాల్‌లో 294

ఉత్తరప్రదేశ్‌లో  275

గుజరాత్‌లో 236

తమిళనాడులో 185

హర్యానాలో 162

తెలంగాణలో 123

ఒడిశాలో  102

ఆంద్రప్రదేశ్‌లో  54

బీహార్‌లో  27

పంజాబ్‌లో 27

గోవాలో  21

జమ్మూకాశ్మీర్‌లో  13

మధ్యప్రదేశ్‌లో 10

Updated Date - 2022-01-12T15:08:18+05:30 IST