Asia Cup 2022: పాకిస్థాన్తో మ్యాచ్లో అరుదైన రికార్డు సాధించిన భారత్
ABN , First Publish Date - 2022-09-05T02:52:03+05:30 IST
సూపర్-4లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ అరుదైన రికార్డు సాధించింది. ఈ మ్యాచ్లో
దుబాయ్: సూపర్-4లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ అరుదైన రికార్డు సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (28), రోహిత్ శర్మ (28) తొలి వికెట్కు 54 పరుగులు జోడించి పునాది వేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ క్రీజులో పాతుకుపోయి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. బ్యాటర్ల జోరుతో 10.4 ఓవర్లలోనే భారత్ 100 పరుగులు పూర్తి చేసుకుంది. ఫలితంగా టీ20ల్లో పాకిస్థాన్పై అత్యంత వేగంగా వంద పరుగులు సాధించిన ఘనత సొంతం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.