India Squad For Asia T20 Cup : విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ రీఎంట్రీ.. బుమ్రా దూరం.. ఆసియా టీ20 కప్ భారత జట్టు ప్రకటన
ABN , First Publish Date - 2022-08-09T03:45:06+05:30 IST
టీ20 వరల్డ్ కప్కు ముందు కీలకమైన ఆసియా టీ20 కప్(T20 Asia Cup)లో ఆడబోయే భారత జట్టును బీసీసీఐ(BCCI) సోమవారం ప్రకటించింది.
ముంబై: టీ20 వరల్డ్ కప్కు ముందు కీలకమైన ఆసియా టీ20 కప్(T20 Asia Cup)లో ఆడబోయే భారత జట్టును బీసీసీఐ(BCCI) సోమవారం ప్రకటించింది. రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జట్టులోకి పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ వైస్కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక కొంత విశ్రాంతి తర్వాత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు. కాగా గాయం కారణంగా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ పేర్లను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ఆరంభమవనుంది. సెప్టెంబర్ 11, 2022న ఈ టోర్నీ ముగుస్తుంది.
భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యజువేంద్ర చహాల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్. కాగా దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరినీ బ్యాటింగ్ ఆప్షన్లు కాగా.. శ్రేయస్ అయ్యర్, అక్సర్ పటేల్, దీపక్ చాహార్ స్టాండ్ బై ప్లేయర్లుగా ఉంటారని బీసీసీఐ వెల్లడించింది.