కివీస్ను చివర్లో కట్టడి చేసిన భారత బౌలర్లు
ABN , First Publish Date - 2021-11-20T02:33:40+05:30 IST
భారత్తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు
రాంచీ: భారత్తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తొలుత ధారాళంగా పరుగులిచ్చుకున్న భారత బౌలర్లు చివర్లో కట్టడం చేయడంతో కివీస్ భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడింది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 31, డరిల్ మిచెల్ 31 పరుగులు చేయగా, గ్లెన్ ఫిలిప్స్ 34, మార్క్ చాప్మన్ 21 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.