సమాజంలో రోజురోజుకు విలువలు తగ్గుతున్నాయి: Venkaiah naidu
ABN , First Publish Date - 2022-03-01T16:30:20+05:30 IST
సమాజంలో రోజురోజుకు విలువలు తగ్గుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
గుంటూరు: సమాజంలో రోజురోజుకు విలువలు తగ్గుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల 60 ఏళ్ల వేడుకల్లో వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి విడగొడుతున్నారని తెలిపారు. నాయకులే ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం బాధాకరమన్నారు. చట్టసభల్లోనే అసభ్య పదజాలం వాడడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాల్లో కులం, మతం, నేర ప్రవృత్తి, డబ్బు ప్రధానమవ్వడం దారుణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.