India vs South Africa: దక్షిణాఫ్రికాతో చివరి టీ20.. టాస్ గెలిచిన ఇండియా

ABN , First Publish Date - 2022-10-05T00:20:00+05:30 IST

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మరికాసేపట్లో జరగనున్న చివరి టీ20లో భారత్ టాస్ గెలిచి

India vs South Africa: దక్షిణాఫ్రికాతో చివరి టీ20.. టాస్ గెలిచిన ఇండియా

ఇండోర్: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మరికాసేపట్లో జరగనున్న చివరి టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే జరిగిన రెండు  మ్యాచుల్లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సఫారీలను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, సొంతగడ్డపై తొలిసారి దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్‌ దక్కించుకున్నప్పటికీ.. ప్రపంచకప్‌కు ముందు టీమిండియా డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ ఆందోళన కలిగిస్తోంది.


ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన కొండంత స్కోరు కొట్టినా.. బౌలర్లు తేలిపోవడంతో కష్టంగా గట్టెక్కింది. మరోవైపు, సిరీస్ ఫలితం ఇప్పటికే తేలిపోవడంతో నేటి మ్యాచ్ నామమాత్రంగా మారింది. దీంతో ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రాహుల్‌కు విశ్రాంతినిచ్చారు.  కొన్ని కారణాల వల్ల అర్షదీప్ జట్టుకు దూరమయ్యాడు. వీరి స్థానాల్లో శ్రేయాస్ అయ్యర్, ఉమేష్ యాదవ్, సిరాజ్‌ జట్టులోకి వచ్చారు.


దక్షిణాఫ్రికా మాత్రం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. నోకియా స్థానంలో డ్వేన్ ప్రిటోరియస్ జట్టులోకి వచ్చాడు. తొలి రెండు మ్యాచుల్లోనూ ఓడిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.  

Updated Date - 2022-10-05T00:20:00+05:30 IST