శ్రీలంకతో రెండో టీ20.. టాస్ గెలిచిన ఇండియా
ABN , First Publish Date - 2022-02-27T00:25:20+05:30 IST
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో మరికాసేపట్లో ప్రారంభం కానున్న రెండో టీ20లో భారత జట్టు టాస్
ధర్మశాల: మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో మరికాసేపట్లో ప్రారంభం కానున్న రెండో టీ20లో భారత జట్టు టాస్ గెలిచి శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించింది. ఇప్పటికే తొలి మ్యాచ్లో నెగ్గిన రోహిత్ సేన ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా సిరీస్ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా, ఇందులో విజయం సాధించి సిరీస్ ఫలితాన్ని చివరి మ్యాచ్కు వాయిదా వేయాలని శ్రీలంక పట్టుదలగా ఉంది.
భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, శ్రీలంక మాత్రం రెండు మార్పులు చేసింది. జనిత్ లియనాగె, జెఫ్రీ వాండెర్సేను బెంచ్కు పరిమితం చేసి బినుర ఫెర్నాడో, దనుష్క గుణతిలక జట్టులోకి వచ్చారు. తొలి మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమైన శ్రీలంక ఈ మ్యాచ్లో భారత్ను నియంత్రించేందుకు సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది.