కరాచీలో దిగిన మరో భారత విమానం

ABN , First Publish Date - 2022-08-16T07:07:48+05:30 IST

మరో భారత విమానం సోమవారం పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

కరాచీలో దిగిన మరో భారత విమానం

ఇస్లామాబాద్‌, ఆగస్టు 15: మరో భారత విమానం సోమవారం పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 12 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ చార్టర్డ్‌ విమానం మధ్యాహ్నం 12.10 గంటలకు కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆ విమానం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది. అయితే ఏ కారణంతో ఈ విమానం కరాచీ విమానాశ్రయంలో దిగిందన్నది స్పష్టంగా తెలియలేదు. కాగా నెల రోజుల్లో భారత విమానాలు కరాచీ విమానాశ్రయంలో దిగడం ఇది మూడోసారి. ఇప్పటికే రెండుసార్లు సాంకేతిక సమస్యలతో స్పైస్‌జెట్‌, ఇండిగో విమానాలు జూలై 5, 17వ తేదీల్లో కరాచీ విమానాశ్రయంలో దిగాయి. 

Updated Date - 2022-08-16T07:07:48+05:30 IST