ప్రవాసుల సమస్యలపై.. కువైట్ అంతర్గత మంత్రితో భారత రాయబారి భేటీ

ABN , First Publish Date - 2021-04-08T13:26:57+05:30 IST

కువైట్‌లో భారత ప్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఆ దేశ అంతర్గర మంత్రి షేక్ థమెర్ అలీ సబా అల్ సలేం అల్ సబాతో బుధవారం భారత రాయబారి సిబి జార్జ్ భేటీ అయ్యారు.

ప్రవాసుల సమస్యలపై.. కువైట్ అంతర్గత మంత్రితో భారత రాయబారి భేటీ

కువైట్ సిటీ: కువైట్‌లో భారత ప్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఆ దేశ అంతర్గర మంత్రి షేక్ థమెర్ అలీ సబా అల్ సలేం అల్ సబాతో బుధవారం భారత రాయబారి సిబి జార్జ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రవాసుల సమస్యలపై వారివురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. అలాగే ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే అంశాలను చర్చించారు. ఆరోగ్యం, భద్రతతో సహా వివిధ రంగాలలో సహకారం విషయమై కూడా ఇరువురు మాట్లాడుకున్నారు. కువైట్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాసులకు సంబంధించిన విషయాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-04-08T13:26:57+05:30 IST