ఇంజనీర్ల సమస్యపై కేఎస్ఈ సెక్రెటరీతో భారత రాయబారి భేటీ

ABN , First Publish Date - 2020-09-23T14:24:24+05:30 IST

కువైట్‌లోని భారత రాయబారి సీబీ జార్జ్ ఇంజనీర్ల సమస్యపై కేఎస్ఈ(కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్) మెంబర్ సెక్రెటరీ అలీ మొహ్సేనితో మంగళవారం భేటీ అయ్యారు.

ఇంజనీర్ల సమస్యపై కేఎస్ఈ సెక్రెటరీతో భారత రాయబారి భేటీ

కువైట్ సిటీ: కువైట్‌లోని భారత రాయబారి సీబీ జార్జ్ ఇంజనీర్ల సమస్యపై కేఎస్ఈ(కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్) మెంబర్ సెక్రెటరీ అలీ మొహ్సేనితో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాయబారి ప్రధానంగా ఇండియన్ ఇంజనీర్లు కువైట్‌లో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కాగా, కువైట్‌లో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లందరీ నమోదు ప్రక్రియ కొనసాగుతున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. భారతీయ ఇంజనీర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి  రాయబార కార్యాలయంలో నమోదు అవసరం అని ఈ సందర్భంగా ఎంబసీ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-09-23T14:24:24+05:30 IST