అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2021-07-29T02:46:56+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన డాక్టర్ మనీషా జుథానీని కనెక్టికట్ పబ్లిక్ హెల్త్ కమిషనర్‌గా ఆ రాష్ట్ర గవర్నర్ నెడ్ లామోంట్ నామినేట్ చేశా

అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన డాక్టర్ మనీషా జుథానీని కనెక్టికట్ పబ్లిక్ హెల్త్ కమిషనర్‌గా ఆ రాష్ట్ర గవర్నర్ నెడ్ లామోంట్ నామినేట్ చేశారు. ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో మనీషా స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గవర్నర్‌ నెడ్ లామోంట్‌కు ధన్యవాదాలు చెప్పడంతోపాటు మహమ్మారిని కట్టడి చేయడం కోసం కృషి చేస్తానని వెల్లడించారు. కాగా.. మనీషా ప్రస్తుతం యేల్ యూనిర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 


Updated Date - 2021-07-29T02:46:56+05:30 IST