బాక్సర్ల పసిడి పంచ్‌

ABN , First Publish Date - 2021-04-23T06:41:20+05:30 IST

ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత అమ్మాయిలు పసిడి పతకాల మోత మోగించారు. మనోళ్ల పంచ్‌ పవర్‌ ముందు ప్రత్యర్థులు నిలవలేకపోయారు

బాక్సర్ల పసిడి పంచ్‌

కీల్స్‌ (పోలెండ్‌): ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత అమ్మాయిలు పసిడి పతకాల మోత మోగించారు. మనోళ్ల పంచ్‌ పవర్‌ ముందు ప్రత్యర్థులు నిలవలేకపోయారు. వివిధ విభాగాల్లో ఫైనల్‌ చేరిన ఏడుగురు బాక్సర్లు స్వర్ణ పతకాలు కొల్లగొట్టడం విశేషం. గురువారం జరిగిన 81 కిలోల ప్లస్‌ ఫైనల్‌ ఫైట్‌లో అల్ఫియా పఠాన్‌ 5-0తో డారియా కాజోరెజ్‌(మోల్డోవా)పై, 69 కిలోల విభాగంలో అరుంధతి చౌదరి 5-0తో మరసిన్‌కోవ్సకా (పోలెండ్‌)పై, 57 కిలోల విభాగంలో పూనమ్‌ 5-0తో గ్రోసి (ఫ్రాన్స్‌)పై, 48 కిలోల కేటగిరీలో గీతిక 5-0తో నటాలియా (పోలెండ్‌)పై నెగ్గి స్వర్ణాలు సాధించారు. వీరితో పాటు సనమాచ చాను (75 కి.), బేబి రోజిసన చాను (51 కి.), వింకా (60 కి.) పసిడి పతకాలు సాధించారు. ఇక, పురుషుల విభాగంలో సచిన్‌ (56 కి.) ఫైనల్‌ చేరాడు.  

Updated Date - 2021-04-23T06:41:20+05:30 IST