యూఏఈలో విచారణ ఎదుర్కొంటున్న భారత దంపతులు !
ABN , First Publish Date - 2020-07-14T15:51:07+05:30 IST
యజమానిని చంపేస్తామని బెదిరించిన కేసులో భారత దంపతులు యూఏఈలో విచారణ ఎదుర్కొంటున్నారు.
యూఏఈ: యజమానిని చంపేస్తామని బెదిరించిన కేసులో భారత దంపతులు యూఏఈలో విచారణ ఎదుర్కొంటున్నారు. తమపై యజమాని వేసిన పరారీ కేసు తిరిగి వెనక్కి తీసుకోకుంటే అతనితో పాటు కుటుంబ సభ్యులను హతమారుస్తామని భారత జంట బెదిరించినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేగాక తనతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలలు తన వద్ద పని చేయాల్సి ఉండగా... తనకు చెప్పాకుండా పని మానేసి మరో వ్యక్తి వద్ద పనికి కుదిరారని బాధితుడు తెలిపాడు. ఇలా ఎందుకు చేశారని అడిగినందుకు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు వాపోయాడు. దాంతో తాను భారత దంపతులపై పరారీ కేసు వేశానని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న దంపతులు కేసు వాపస్ తీసుకోకుంటే చంపేస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు భారత దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.